‘పేపర్ లీక్ మా వైఫల్యమే’.. తప్పు ఒప్పుకుంటూ సీఎం కీలక ప్రకటన

-

పేపర్ లీక్ మా వైఫల్యమే.. తప్పు నాదే అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఓ కీలక ప్రకటన చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకవడం తమ వైఫల్యాన్ని తెలియజేస్తోందని అన్నారు. తప్పు జరిగిందని తాను అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ వెనుక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించామని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఉపాధ్యాయుల పాత్ర ఉందని తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్​పై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.

అసోంలో పదో తరగతి పరీక్షా పేపర్​ లీకైన విషయం తెలిసిందే. సోమవారం (మార్చి 13) జరగాల్సిన జనరల్​ సైన్స్​ క్వశ్చన్​ పేపర్.. ఆదివారం రాత్రే బయటకు వచ్చినట్లు అసోం బోర్డ్ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్(సెబా) అధికారులు గుర్తించారు. వెంటనే పరీక్ష రద్దు చేశారు. మార్చి 30న జనరల్ సైన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

Video Player is loading.

పేపర్​ లీక్​పై సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు చేశారు. వాట్సాప్​లో పేపర్ లీక్ చేశారని.. ప్రశ్నాపత్రం ఇచ్చేందుకు రూ.3000 వరకు వసూలు చేశారని గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news