అస్సాం, మేఘాలయ మధ్య చారిత్రాత్మక ఒప్పందం… 50 ఏళ్ల సరిహద్దు వివాదానికి స్వస్తి

-

అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య చారిత్రాత్మక ఒప్పంద కుదిరింది. గత 50 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సరిహద్దు వివాదానికి స్వస్తి పలికాయి ఇరు రాష్ట్రాలు. ఈ రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య గత 50 ఏళ్ల నుంచి సరిహద్దు వివాదం ఉంది. తరుచుగా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. తాజాగా ఈ రోజు జరిగిన ఒప్పందంతో సరిహద్దు వివాదం దాదాపుగా సమిసిపోయినట్లు అయింది. ఢిల్లీలో కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మాలు ఇద్దరు ఒప్పందంపై సంతకం చేశారు. ఇది చాలా చారిత్మాత్మకమైన రోజని, ఈశాన్య రాష్ట్రాలు భారతదేశ వృద్ధి ఇంజిన్‌గా మార్చేందుకు కృషి చేస్తాం అని హిమంత బిశ్వ శర్మ అన్నారు. మరికొన్ని సరిహద్దు వివాదాలను ఆరేడు నెలల్లో పరిష్కరించుకుంటామని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు మాకు దిశానిర్దేశం చేసినందుకు హెంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలియజేశారు మేఘాలయ సీఎం. ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న 12 పాయింట్లలో ఆరు పూర్తయ్యాయని.. దీంతో 70 శాతం సరిహద్దు సమస్య పూర్తయిందని.. మిగతా ఆరింటిని త్వరలోనే పరిష్కరిస్తామని అమిత్ షా అన్నారు. ఇదే విధంగా అస్సాం- అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమస్యలను కూడా పరిష్కరించాలని హిమంత బిశ్వశర్మ, అమిత్ షాను కోరారు. ఇదే విధంగా మిజోరాం, నాగాలాండ్ సీఎంలతోను చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news