ఎన్నికలు ముగిసే వరకు ఆ సినిమాలు బ్యాన్ చేయండి.. ఈసీకి బీజేపీ లేఖ

-

ఇది ఎన్నికల సీజన్. ఈ ఎఫెక్టు క్రమంగా ప్రతీ రంగంపైనా పడుతోంది. సినీ తారలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలనూ వదలడం లేదు. తాజాగా ఎన్నికల సెగ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ని తాకింది. ఆయనను బీజేపీ టార్గెట్ గా ఎంచుకుంది. ఎందుకంటే.. శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరఫున షిమోగా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ప్రస్తుతం తన సతీమణి తరఫున ఎన్నికల ప్రచారంలో శివరాజ్ కుమార్ బిజీగా ఉన్నారు. కన్నడ నాట శివరాజ్ కుమార్కు మంచి పాపులారిటీ ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు శివరాజ్ కుమార్ సినిమాలు, యాడ్స్, బిల్ బోర్డు డిస్ ప్లే లను బ్యాన్ చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కర్ణాటక బీజేపీ లేఖ రాసింది. ఈమేరకు శివరాజ్ కుమార్ పై  కర్ణాటక బీజేపీ సీనియర్ నేత రఘు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు లేఖను పంపారు. శివరాజ్ కుమార్ సినిమాలు ఎన్నికల సమయంలో ప్రజలపై ప్రభావం చూపుతాయని.. అందుకే తాము ఈసీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని రఘు తెలిపారు. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news