56 ఏళ్ల వయసులో తొలిసారి ఓటేసిన బీటౌన్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌

-

లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఉదయం నుంచే సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.  స్టార్‌ సెలబ్రిటీలు అక్షయ్‌ కుమార్, జాన్వీ కపూర్, రాజ్‌కుమార్‌ రావ్‌, ఐరా ఖాన్‌, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్‌, షాహిద్‌ కపూర్‌ సహా పలువురు తారలు ఓటేశారు.

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తొలిసారి ఓటేశారు. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్‌, గతేడాది ఆగస్టు 2023లో తొలిసారి భారతీయ పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మొదటిసారి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇక ఐదో దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news