బ్రేకింగ్: అమిత్ షాకు మళ్ళీ అనారోగ్యం, ఢిల్లీ ఎయిమ్స్ కి తరలింపు…!

-

బిజెపి అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోగ్యంపై ఇప్పుడు ఆందోళనకర వార్తలు వస్తున్నాయి. ఆయన ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. దీనితో డిశ్చార్జ్ కూడా చేసారు వైద్యులు. అయితే రాత్రి 2 గంటల తర్వాత ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడటంతో వెంటనే ఆయన భద్రతా సిబ్బంది ఢిల్లీలోని ప్రముఖ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు వివరాలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ ఆరా తీసారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది. కరోనా నుంచి కోలుకున్నా సరే ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news