బ్రేకింగ్: అరుణాచల్ ప్రదేశ్ లో భారీగా బలగాలు మోహరించిన ఇండియా

-

భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో భారత ఆర్మీ భారీగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మోహరించింది. సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులను రక్షణ శాఖా ఆరా తీస్తుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద పరిస్థితి మూడు రోజుల నుంచి ఆందోళనకరంగా ఉంది. ఈ క్రమంలోనే సుదీర్ఘ సరిహద్దుల్లో భారీగా బలగాలను మొహరించారు. ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.

సిక్కిం సహా పలు రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా భారీగా మొహరించారు. భూటాన్, నేపాల్ సరిహద్దుల్లో కూడా భారత ఆర్మీ బలగాలు ఎక్కువగా మొహరించాయి. అనుమానాస్పదంగా చైనా కదలికలు ఉన్న నేపధ్యంలో చైనా అర్మీని కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చైనా సరిహద్దుల్లో భారీగా యుద్ద టాంకర్ లను మోహరించింది. భరత్ కూడా అదే స్థాయిలో మొహరించి గట్టి సమాధానం ఇవ్వాలని భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news