UPSC సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్​ చేస్కోండి

-

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ 2023 పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలతో పాటు ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ ఫలితాలను కూడా అధికారులు విడుదల చేశారు.

ఈ ఏడాది మే 28న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరు ఈ ఏడాది సెప్టెంబరు 15వ తేదీన జరిగే మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ – 1 (DAF-I)లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్‌ త్వరలోనే వెల్లడించనుంది.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news