రేపటి నుంచి 5 రోజుల పాటు కాంగ్రెస్ “ఆజాదీ కి పాదయాత్ర”

-

దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆగస్టు 9 అంటే రేపటి నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “ఆజాదీ కి గౌరవ పాదయాత్రలు” నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు 75 కిలోమీటర్ల “ఆజాదీ కి పాదయాత్ర” లు ఆగస్టు 14 వ తేదీతో ముగిసిన తర్వాత, ఆగస్టు 15 న పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాల్లో 75 వ స్వాతంత్రోత్సవాలు నిర్వహించనున్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు “గౌరవ పాదయాత్రల” కార్యక్రమానికి రూప కల్పన చేసిన సి.డబ్ల్యు.సి… 75 వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ప్రతి జిల్లాలోనూ మొత్తం 75 కిలోమీటర్ల మేరకు “గౌరవ పాదయాత్రలు” నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వాలకు ఆదేశించారు.

ప్రతి జిల్లాలో నిర్వహించే “గౌరవ పాదయాత్రల్లో” భాగంగా, ఆయా జిల్లాల్లో ఉన్న స్వాతంత్ర సమరయోధులను, వారి కుటుంబాలను కలిసి గౌరవించాలని, వారి త్యాగనిరతిని గుర్తుచేసుకోవాలని, స్వాతంత్ర్యోద్యమంతో సంబంధం ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలను, కట్టడాలను సందర్శించాలని పార్టీ ఆదేశించారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున “గౌరవ పాదయాత్రలు” నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news