కాంగ్రెస్ కనీసం 50 సీట్లను కూడా గెలుచుకోలేదు.. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

-

మరోసారి ప్రధాని మోడీ కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా కూడా  రాదన్నారు. ఒడిశాలో తొలిసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కాంగ్రెస్ కనీసం 50 సీట్లు కూడా గెలవదని చెప్పారు. కంధమాల్ లోని పుభావిలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

పదేళ్లలో బీజేపీ సాధించిన విజయాలను 500 ఏళ్ల ఎదురుచూపుల తరువాత అయోధ్యలో తమ ప్రభుత్వం రామమందిరాన్ని నిర్మించిందన్నారు. మాజీ ప్రధాని అటలీ బీహారీ వాజ్ పేయి పోక్రాన్ పరీక్షలను నిర్వహించి భారతదేశ ప్రతిష్టను పెంచారని.. 26 ఏళ్ల క్రితం బీజేపీ సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఒడిశాలో బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు ప్రధాని.

Read more RELATED
Recommended to you

Latest news