జమ్ములో భారీ ఉగ్రదాడి.. ఇంటెలిజెన్స్ వర్గాల వార్నింగ్..!

-

జమ్ములో భారీ ఉగ్రదాడికి జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. రాజకీయ నాయకులు, మాజీ సైనికోద్యోగులు, స్థానికులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి జరగవచ్చని తెలిపాయి. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఒక స్థానిక ఉగ్రవాది, ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదుల కదలికలను భధ్రతా దళాలు బారాముల్లాలో గుర్తించాయి. ఈ ఉగ్రవాదులు దాడులకు హ్యాండ్‌ గ్రనేడ్లు, ఐఈడీలను ఉపయోగించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ యూనిట్లు పేర్కొంటున్నాయి.

ఈ ఉగ్రవాద బృందం బారాముల్లాలోని ఛక్లూ గ్రామంలో తిరుగుతుండగా అక్టోబర్‌ 27వ తేదీ సాయంత్రం గుర్తించారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌  నుంచి ముప్పు పొంచి ఉందని తెలిపారు.

‘‘పోలీసులను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారిని కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చు’’ అని దిల్‌బాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌ పోలీసులు  ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news