BREAKING: వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత

-

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు, వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా నిమోనియా సహ ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఆదివారం మరింత క్షీణించింది. అక్టోబర్ 25న హైదరాబాదులోని ఏఐజి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు భగీరథ రెడ్డి.

నిమోనియా సహా ఇతర అనారోగ్య సమస్యలకు డాక్టర్లు చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. నేడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. దీంతో చల్లా సొంత గ్రామం కర్నూలు జిల్లా అవుకులో విషాదఛాయలు అలుముకున్నాయి. రేపు అవుకులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news