లగ్గాలపై కొవిడ్ ఎఫెక్ట్.. పెరుగుతున్న పెండ్లికాని ప్రసాద్ లు..

-

కొవిడ్ ఎఫెక్ట్ దేశంలో ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలోనో రోజువారీ కేసుల్లో ఇండియా నెం.1 స్థానంలో ఉంది. రోజూ మూడున్నర లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటివి పెట్టాయి. ఇవే కాకుండా జనాలు గుమిగూడకుండా పెళ్లిల్లు, ఫంక్షన్లు, మీటింగులపై ఆంక్షలు విధించాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. ఈ మధ్య పెళ్లిల్లు వరుసగా వాయిదా పడుతున్నాయి. మొన్నటికి మొన్న రేపు పెండ్లి అనగా వరుడికి కరోనా రావడంతో ఆ లగ్గం ఆగిపోయింది. అంతే కాదు నిజామాబాద్ లో ఓ పెళ్లి కూతురుకు కరోనా వచ్చి చనిపోయింది. ఇలా పెళ్లి వేడుకల్లో కరోనా విషాదం నింపుతోంది.

పోయినేడాది కరెక్ట్ గా పెళ్లిల్ల టైమ్ లోనే లాక్ డౌన్ పడి చాలా వరకు లగ్గాలు ఆగిపోయాయి. దీంతో వీటిపై ఆధారపడిన చాలా మంది జీవనోపాధి కోల్పోయారు. టెంట్ హౌజ్, బ్యాండ్ మేళం, మేకప్ ఆర్టిస్టులు, డెకరేషన్, వంట వాళ్లు.. ఇలా ఒక్క టేమిటి పెళ్లిల్లు, ఫంక్షన్ల బిజినెస్ లు మొత్తం కుప్పకూలాయి. చాలా మంది రోడ్డున పడ్డారు. ఇక ఫస్ట్ వేవ్ తగ్గింది కదా ఈ సారి పెళ్లిల్ల సీజన్ మొదలవుతుంది అనుకునే టైమ్ కు కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ నెల 29 నుంచి జూలై 4 వరకు 30కి పైగా మంచి పెళ్లి ముహూర్తాలున్నాయని పురోహితులు చెబుతున్నారు.

కరెక్ట్ గా మళ్లీ ఇదే టైమ్ లో కరోనా తీవ్ర స్థాయిలో రావడంతో పెళ్లిల్లు మళ్లీ వాయిదా పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో పెండ్లికాని ప్రసాద్ లు, పెండ్లికాని మిస్సమ్మలు ఏటేటా పెరిగిపోతున్నారు. ఇక ఏదేమైనా సరే అని కొందరు సింపుల్ గా పెండ్లి చేసుకుంటున్నా.. అలాంటి వారి సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే పెండ్లి అనేది ఒకే సారి చేసుకుంటాం కాబట్టి.. కొవిడ్ తగ్గాకే గ్రాండ్ గా చేసుకుందాం అని అనుకునే వారు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఇప్పుడు పెళ్లిల్లు ఫిక్స్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో.. వారందరికీ పెళ్లిల్లు ఎప్పుడు అవుతాయో అంటూ వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news