కరోనాపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు…!

-

సేరో సర్వే పై ఢిల్లీ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. సెరో సర్వేని పరిశీలించిన ఢిల్లీ హైకోర్ట్… ప్రతీ నలుగురిలో ఒకరికి కరోనా సోకినట్లు కనిపిస్తోంది అని పేర్కొంది. దేశ రాజధానిలో దాదాపు ప్రతి ఇంట్లో ఈ వైరస్ వెళ్ళింది అని పేర్కొంది. జస్టిస్ హిమా కోహ్లీ, సుబ్రమోనియం ప్రసాద్ ల బెంచ్ ముందు ఉంచిన నాలుగో రౌండ్ సెరో సర్వే తాజా నివేదిక ప్రకారం ఈ వ్యాఖ్యలు చేసింది.

సెప్టెంబరులో నిర్వహించిన సర్వే డేటాతో పోలిస్తే… ఆ తర్వాత కరోనా చాలా వేగంగా పెరిగింది. పరీక్షించిన వారిలో 25 శాతం మందిలో కరోనా యాంటీబాడీస్ ఉన్నట్లు తాజా నివేదికలో గుర్తించారు. సర్వే డేటాను ప్రస్తావిస్తూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలను ఎందుకు సడలించడం అని ప్రశ్నించింది. అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 21 మధ్య నిర్వహించిన సర్వేలో, 15,015 మందిని పరీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news