ఢిల్లీలో సెక్యురిటీ అలెర్ట్… టెర్రర్ అటాక్ సమాచారంతో భద్రత పెంపు

-

దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఈ విషయాల్ని ధ్రువీకరిస్తున్నాయి. దీంతో న్యూఢిల్లీలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో దేశ రాజధానిలో సెక్యురిటీ టైట్ చేశారు పోలీసులు.

పోలీసుల ప్రకారం ఉగ్రవాద దాడులను చేస్తామని కొన్ని ఈ మెయిళ్లు వచ్చిన నేపథ్యంలో హైఅలెర్ట్ ప్రకటించారు. తెహ్రిక్ – ఇ – తాలిబన్ ఉగ్రవాద సంస్థ నుంచి ఈమెయిళ్లు వచ్చిన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ ఈమెయిళ్ల వివరాలను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు.. ఢిల్లీ పోలీసులకు పంపారు. వచ్చిన  వివరాల ఆధారంగా ఢిల్లీ పోలీసులు మంగళవారం న్యూఢిల్లీలోని సరోజిని నగర్ మార్కెట్ లో సోదాలు నిర్వహించారు. కొన్ని భద్రతపరమైన ముప్పు కారణంగా… గట్టి నిఘాను పాటించాలని  ఢిల్లీ పోలీసులకు ఆదేశిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇమెయిల్ పంపిన వ్యక్తిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  ఈ ఈమెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది…. ఎవరు పంపారనే దానిపై ఆరా తీస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news