BREAKING : ఏఐసీసీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న దిగ్విజయ్‌

-

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఏఐసీసీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌. నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ తాజాగా దిగ్విజయ్‌ సింగ్‌ వెల్లడించారు. ఖర్గే పేరును ప్రతిపాదిస్తున్నా.. పార్టీకి నేను విధేయుడిని అని వెల్లడించారు.

ఖర్గే చాలా సీనియర్‌ నాయకులు.. ఆయనతో నేను పోటీపడనని తేల్చి చెప్పారు దిగ్విజయ్‌సింగ్‌. దీంతో మల్లీ ఖార్జున ఖార్గే ఫైనల్‌ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా, ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తన పోటీని ఖాయం చేయడంతో అభ్యర్థులు ఖరారైనట్లే కన్పించింది. చివరి నిమిషంలో మరో సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news