కొత్త పేర్లతో ఇండియాలో చైనా యాప్స్ ఎంట్రీ?

-

చైనా యాప్స్‌ను కేంద్రప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా నిషేధించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా, యాప్స్ నిషేధంలో ఉన్నాయని అందరు అనుకుంటున్నారు. కానీ, యాప్స్‌లో కొన్నిటిని చైనా గుట్టుగా ఇండియాలో నడిపిస్తున్నట్లు సమాచారం. ఓల్డ్ నేమ్స్‌కు బదులుగా కొత్త కంపెనీల పేర్లతో ఈ యాప్స్ రన్ అవుతున్నాయట. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ చైనీస్ మూలాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలా కొత్త కంపెనీ పేర్లతో తమ యాప్‌లను లిస్ట్ చేస్తున్నాయి. అయితే, యాప్‌ ఓనర్ షిప్ పబ్లిక్ డేటా అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు భారతదేశంలో టాప్ 60 యాప్‌లలో కనీసం 8 యాప్‌లు చైనా ఆపరేట్‌గా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

ప్రతీ నెలా 211 మిలియన్లకు పైగా భారతీయ యూజర్లను చేరుకోవాలనేది వీటి లక్ష్యమని ఓ నివేదిక స్పష్టం చేసింది. జూలై 2020లో చైనీస్ యాప్‌లు నిషేధించిన తర్వాత అదే యాప్‌లు 96 మిలియన్ యూజర్లను కలిగి ఉన్నాయి. గత 13 నెలల్లో 115 మిలియన్ కొత్త యూజర్లు చేరినట్లు సమాచారం. చైనా యాప్స్ వల్ల భారత పౌరుల భద్రతకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దని కేంద్ర నిషేధం విధించినప్పటికీ చైనా యాప్స్ కొత్త ముసుగులో వచ్చి భారత యూజర్లే లక్ష్యంగా పని చేస్తున్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు.

నిషేధం తర్వాత చాలా యాప్స్.. తొందరగా పెద్ద సంఖ్యలో యూజర్లను చేరుకునేందుకుగాను న్యూ నేమ్స్‌తో యాప్స్‌ను ఆపరేట్ చేస్తున్నాయని గుర్తించారు. భారతదేశంలో చైనీస్ యాప్ ప్లేఇట్ బాగా వేగంగా అభివృద్ధి చెందింది. కేవలం నెలల్లోనే లక్షల మంది యూజర్స్‌ను టార్గెట్ చేసి ఆ టార్గెట్ ను రీచ్ అయింది కూడా. ఈ యాప్ ద్వారా వీడియోలను ప్లే చేయడమే కాదు.. ఎంఎక్స్‌ప్లేయర్, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో మూవీస్, షోల పైరేటెడ్ కాపీస్‌ను టెలిగ్రామ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలాగా డౌన్ లోడ్ చేసిన సినిమాలను ప్లేఇట్ యాప్‌లో ప్లే చేసే వీలుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news