మ‌హారాష్ట్ర లో ఎన్‌కౌంట‌ర్ అయిన 26 వారి పై భారీగా రివార్డ్

-

మ‌హారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుక చత్తీస్ గఢ్ సరిహద్దు గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్ కౌంట‌ర్ లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ 26 మంది మావోయిస్టు ల‌పై రూ. 50 ల‌క్ష‌ల రివార్డ్ ఉంది. మృతి చెందిన వారిలో ఒక కేంద్ర కమీటి స‌భ్యుడు దీప‌క్ తేల్టుంబ్డే ఉన్నారు. అలాగే ఎన్ కౌంట‌ర్ లో మృతి చెందిన వారి వివ‌రాలు ఇలా ఉన్నాయి. అడ్మా పోడియం, బండు ఇత‌ని పై 4 లక్షల రివార్డ్ ఉంది.

ప్రమేద్ ఇత‌ని పై కూడా 4 లక్షల రివార్డ్ ఉంది. కోసా పై కూడా 4 లక్షలు రివార్డ్ ఉంది. చేతన్ పదా 2 లక్షలు రివార్డ్ ఉంది. విమల మిలింద్ కు బాడిగార్డ్ 4 లక్షల రివార్డ్ ఉంది. అలాగే కిషన్ పై కూడా 8 లక్షలు రివార్డ్ ఉంది. మహేష్ పై అత్య‌ధికంగా 16 లక్షలు రివార్డు ఉంది. బగత్ సింగ్ ఇత‌ను మిలింద్ బాడీగార్డ్ గా ఉన్నాడు. ఇత‌ని పై కూడా అత్య‌ధికంగా 16 లక్షల రివార్డు ఉంది. సన్ను పై 8 లక్షల రివార్డు ఉంది. ప్రకాశ్, సాదు సోన్ బోగా వీరి పై కూడా 4 ల‌క్ష‌ల రివార్డు ఉంది. లచ్చు పై కూడా 4 ల‌క్ష‌ల రివార్డు ఉంది. నవులురాం , దీలిప్ కూడా 4 ల‌క్ష‌ల రివార్డు ఉంది. అలాగే అత్య‌ధికంగా 20 ల‌క్ష‌ల రివార్డు లోకేష్, మగుపోడియా పై ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news