ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు టెకీలు దుర్మరణం

-

ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులు వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ దుర్ఘటన కర్ణాటకలో బెంగళూరు- మైసూరు హైవేపై నాగమంగళ సమీపంలో ఇవాళ జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు- మైసూరు హైవేపై ఇవాళ ఉదయం కర్ణాటక ఆర్టీసీ బస్సు నిలిచింది. ఆగి ఉన్న ఆ బస్సును అకస్మాత్తుగా ఓ కారు వచ్చి ఢీ కొట్టింది. అయితే వేగంగా వెళ్లడం వల్లే అదుపుతప్పి ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు సాఫ్ట్​వేర్ ఇంజినీర్లు మరణించారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. వీళ్లంతా బెంగళూరుకు చెందినవారని తెలుస్తోంది. అయితే వారు మద్యం మత్తులో అయినా లేదా నిద్ర మత్తులోనో కారు నడపడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news