బంగారం కదిలింది.. వెండి షాకిచ్చింది..!

-

బంగారం ధర మళ్ళీ పెరిగింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నిన్న కాస్త పైకి కదిలింది.. నేడు కూడా అదే బాటలో ముందుకు సాగింది. దీంతో గోల్డ్ లవర్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 160 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 54,200 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల ధర రూ. 180 పెరగడంతో రూ. 49,720 కు చేరుకుంది. కాగా, బంగారం బాటలోనే వెండి ధర కూడా పైకి కదిలింది.

కేజీ వెండి ధర రూ. 2,100 పెరిగింది. దీంతో ధర రూ. 68,700 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 70 మేర పెరగడంతో రూ.55,000 చేరుకుంది. అలాగే రూ.500 పెరుగుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 కి చేరుకుంది. ఇకపోతే అంతర్జాతీయంగా బంగారం ధర 1972  డాలర్లకు చేరుకుంది. వెండి ధర 28.36 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news