పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఈ నెలలోనే వడ్డీ జమ..!

-

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగులకు వడ్డీని వారి ఖాతాలో జమ చేయనున్నారు..ఈ ఏడాదికి వడ్డీ కూడా పెరిగిందని తెలుస్తుంది.ఈ ఏడాదికి 8.1 శాతం వడ్డీ లభిస్తుందని అంచనా. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈపీఎఫ్‌వో 2022 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలలోకి వచ్చే వడ్డీని లెక్కించింది. త్వరలో ఇది ఖాతాదారుల ఖాతాకు బదిలీ చేయనుంది..

గతేడాది వడ్డీ కోసం 6 నుంచి 8 నెలల పాటు నిరీక్షించాల్సి రావడం గమనార్హం..ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం ఆలస్యం చెయ్యదని తెలుస్తుంది.వడ్డీ డబ్బును జూలై 15 వరకు ఖాతాలలో బదిలీ చేయవచ్చు. ఈ ఏడాది వడ్డీ 40 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. మీరు బ్యాలెన్స్‌ ఎలా చెక్ చేసుకోవాలంటే..

*. ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. epfindia.gov.inలో ఈ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి.

*. ఇప్పుడు passbook.epfindia.gov.in కి న్యూ పేజీ ఓపెన్‌ అవుతుంది.
*. ఇక్కడ వినియోగదారు పేరు (UAN నంబర్), పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్‌ చేయండి.
*. అన్ని వివరాలను అందించిన తర్వాత మీరు మరో న్యూ పేజీకి వస్తారు. ఇక్కడ మీరు సభ్యుల IDని ఎంచుకోవలసి ఉంటుంది.
*. ఇక్కడ మీరు ఈ-పాస్‌బుక్‌లో మీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ పొందుతారు.

Read more RELATED
Recommended to you

Latest news