రాజస్థాన్ లో ‘వివాహ్’ సినిమా రిపీట్.. ఆస్పత్రిలోనే వధువుకు తాళి కట్టిన వరుడు

-

వివాహ్ సినిమాలో పెళ్లి రోజునే అగ్నిప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరోయిన్ అమృతా రావ్ కు హీరో షాహిద్ ఆస్పత్రిలోనే తాళి కడతాడు. ఈ సీన్ గుర్తుంది కదా మీకు. అచ్చం ఇలాంటి సీన్ రాజస్థాన్ లోని కోటాలో రిపీట్ అయింది. కాకపోతే ఇక్కడ వధువు పెళ్లి రోజున మెట్లపై నుంచి జారి పడింది. అసలేం జరిగిందంటే..?

కోటా జిల్లాలోని రామ్​గంజ్​ మండి ప్రాంతంలోని భావ్​పురా నివాసి పంకజ్​కు రావత్​భటా నివాసి మధు రాఠోడ్​తో శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. కొన్ని రోజుల నుంచి ఇరువురి ఇళ్లలో వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వధువు వివాహ వేదికకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మెట్లపై నుంచి జారిపడింది.

ఆ ఘటనలో ఆమె రెండు చేతులు విరిగాయి. వధువు తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. వధువు జారిపడిన విషయం చెప్పేలోపే వరుడి కుటుంబం పెళ్లి మండపానికి బయలుదేరిపోయింది.

పంకజ్ తండ్రి శివలాల్ రాఠోడ్, మధు తండ్రి రమేష్ రాఠోడ్​ ఇద్దరూ ఈ విషయం గురించి మాట్లాడుకుని ఆస్పత్రిలోనే వివాహ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. వారిద్దరి పెళ్లి కోసం హాస్పిటల్​లో ఒక గదిని బుక్​ చేసి, దాన్ని అందంగా అలంకరించారు. వివాహ తంతు అంతా అక్కడే నిర్వహించారు. వధూవరులు ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకున్నారు. తర్వాత మూడుముళ్ల బంధంతో ఇరువురూ ఒక్కటయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news