అసలు విమాన ప్రమాదం ఎలా జరిగింది…?

-

కేరళ విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 17 కి పెరిగింది. ఇద్దరు పైలట్లు చనిపోయారు, మొత్తం నలుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. గాయపడిన వారిని మలప్పురం & కోజికోడ్ ఆసుపత్రులలో చేర్చారు. ఇదిలా ఉంటే… ప్రయాణీకులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ మానవతా సహాయం అందించడానికి గానూ దేశ రాజధాని ఢిల్లీ నుంచి రెండు మరియు ముంబై నుండి ఒక ప్రత్యేక సహాయ విమానాలను ఏర్పాటు చేశామని ఎయిర్ ఇండియా పేర్కొంది.

At least 17 dead after Air India Express flight from Dubai crash ...

ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి గానూ ఏఏఐబీ, డీజీసిఏ మరియు విమాన భద్రతా విభాగాలు చేరుకున్నాయని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై దృష్టి సారించింది. కొంత మంది ప్రయాణికుల ఆరోగ్యం విషమంగా ఉంది అని తెలుస్తుంది. వారిని అవసరం అయితే ఢిల్లీ తరలించి చికిత్స అందిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news