ఉగ్ర కార్యాకలాపాలకు నిధులిచ్చే మాధ్యమాలు నిషేధించాల్సిందే.. భుట్టో సాక్షిగా భారత్ ఘాటు వ్యాఖ్యలు

-

ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి.. ఉగ్ర కార్యకలాపాలను ప్రేరేపిస్తూ.. వాటికి నిధులు సమకూర్చే మాధ్యమాలను నిషేధించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ సాక్షిగా భారత్‌.. దాయాదిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని ఎస్​సీవో సభ్య దేశాలకు నొక్కి చెప్పింది.

గోవా వేదికగా భారత్‌ నేతృత్వంలో రెండో రోజు ఎస్​సీవో విదేశాంగ మంత్రుల మండలి సమావేశం జరిగింది. పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టోతో పాటు చైనా విదేశాంగ మంత్రి క్వింగ్‌ గాంగ్‌, రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఇందులో పాల్గొన్నారు. వీరితో పాటు తజకిస్థాన్‌, కిర్జికిస్థాన్‌, కజకిస్థాన్‌ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇందులో ఆంగ్లాన్ని ఎస్సీవో మూడో అధికారిక భాషగా గుర్తించాలని సభ్య దేశాలను జైశంకర్‌ కోరారు. రష్యన్‌, మాండరిన్‌లు అధికారికంగా ఉన్న క్రమంలో ఆంగ్లాన్నీ అధికారిక భాషగా చేర్చాలన్నారు.

“ఉగ్రవాద ముప్పు నిరంతరం కొనసాగుతోంది. ఉగ్రవాదానికి ఎటువంటి సమర్థన ఉండకూడదు. దానిని సమర్థించడం, సీమాంతర ఉగ్రవాదంతోపాటు అన్ని రూపాల నుంచి తీవ్రవాదాన్ని నిర్మూలించాలి. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలి. ఎస్​ఈవో ఉద్దేశ్యాలలో ఉగ్రవాదం ముఖ్యమైనదని మళ్లీ గుర్తు చేస్తున్నాను.”

— ఎస్‌. జై శంకర్‌, విదేశాంగమంత్రి

Read more RELATED
Recommended to you

Latest news