World Cup 2023 : లంకపై గ్రాండ్ విక్టరీ.. సెమీస్ బెర్త్ ఖరారు..

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా మరోసారి తన సత్తాను చాటింది. శ్రీలంక జట్టుపై ఏకంగా 302 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ముంబైలోని వంఖాడే వేదికగా ఈ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి నేరుగా సెమిస్ కు చేరింది టీమిండియా జట్టు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా… నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది.

India won by 302 runs

ఇందులో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, గిల్ చాలా బాగా రాణించారు. అయితే ఈ ముగ్గురు ఈ మ్యాచ్ లో సెంచరీ మిస్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలో 55 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో 302 పరుగులతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి మహమ్మద్ షమీ మెరిశాడు. అద్భుతమైన బౌలింగ్ చేసి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. అటు బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కూడా శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news