అమృతో మహోత్సవ్: కేంద్రం కొత్త కాంటెస్ట్.. గెలిస్తే రూ.25 లక్షలు..!

-

ఏకంగా రూ.25 లక్షలు పొందే అద్భుతమైన అవకాశాన్ని మోదీ సర్కార్ కల్పిస్తోంది. ఈ బంపర్ ఆఫర్ ని వినియోగించుకుని రూ.25 లక్షలని పొందడానికి ప్రయత్నం చేస్తే లైఫ్ సెట్ అయ్యిపోతుంది. ఇక దీని కోసం పూర్తిగా చూసేద్దాం. మోదీ ప్రభుత్వం ఒక కాంటెస్ట్‌ ని నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం అమృతో మహోత్సవ్ పేరుతో యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021 కాంటెస్ట్ నిర్వహిస్తోంది.

ఇందులో విజేతలుగా నిలిచిన వారికి రూ.25 లక్షలు అందిస్తోంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి రూ.25 లక్షలు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి రూ.15 లక్షలు, థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి రూ.10 లక్షలు వస్తాయి. సెలెక్షన్ ప్రాసెస్‌లో రెండు స్టేజ్‌లు ఉంటాయి. తొలిగా అర్హత కలిగిన ఎంట్రీస్‌కు స్క్రీనింగ్ ఉంటుంది. తర్వాత రెండో స్టేజ్‌లో జ్యూరీ ఎంపిక, డెమో వంటివి ఉంటాయి.

షార్ట్ లిస్ట్ చేసిన యాప్స్ రివార్డు అందిస్తారు. అయితే వరల్డ్ క్లాస్ యాప్స్‌గా ఎదిగే సత్తా ఉన్న యాప్స్‌ను గుర్తించి వాటికి ప్రైజ్ మనీ అందిస్తారు. 16 కేటగిరిల్లో ఎంట్రీస్‌ను ఆహ్వానిస్తున్నారు. ఇక కేటగిరిలలోకి వెళితే..

సోషల్ మీడియా, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, అగ్రికల్చర్, న్యూస్, గేమ్స్, ఫిన్‌టెక్, నావిగేషన్. అయితే ఇలా 16 కేటగిరిల్లో మీరు అత్యున్నత ప్రమాణాలతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యాప్స్‌ను రూపొందించొచ్చు. కేవలం ఇండియన్స్ మాత్రమే పాల్గోవాలి. అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news