మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి

-

తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై పట్నం మహేంధర్ రెడ్డితో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ కి సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు హాజరయ్యారు. మంత్రి మహేంధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జాతీయ గీతాన్ని ఆలపించారు. 

 

ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రెండో సారి మంత్రి పదవీ అందించినందకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్, తాండూరు జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. గతంలో తాను స్వల్ప తేడాతో రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయానని గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. వాస్తవానికి రెండు, మూడు రోజుల కిందటే మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణం చేయాల్సి ఉంది. కానీ గవర్నర్ తమిళి సై పాండిచ్చేరిలో ఉండటంతో ప్రమాణ స్వీకారం ఈరోజు చేయాల్సి వచ్చింది. 

Read more RELATED
Recommended to you

Latest news