కోవిడ్ బాధితుల కోసం ఫండ్ రైజ‌ర్ కార్య‌క్ర‌మం.. స‌హాయం చేయాల‌ని కోహ్లి, అనుష్క శర్మ పిలుపు..

-

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌ల జంట కోవిడ్ నేప‌థ్యంలో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించేందుకు న‌డుం బిగించింది. ఈ క్ర‌మంలోనే వారు కోవిడ్ రిలీఫ్ ఫండ్ క్యాంపెయిన్‌ను చేపట్టారు. ఈ క్యాంపెయిన్ ద్వారా కోవిడ్ బాధితుల‌కు స‌హాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌న‌స్సున్న మ‌హారాజులు, దాత‌లు ఈ క్యాంపెయిన్ ద్వారా పేద‌ల‌కు స‌హాయం చేయాల‌ని వారు కోరారు.

kohli and anushka sharma fund riser campaign for covid victims

కోవిడ్ బాధితులకు స‌హాయం అందించేందుకు ప్ర‌జ‌లు ముందుకు రావాల‌ని విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌లు కోరారు. ఈ మేర‌కు వారు సోష‌ల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. కాగా న‌టి అనుష్క శ‌ర్మ ఇటీవ‌లే త‌న జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకుంది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. అయితే దేశంలో చాలా భ‌యాన‌క వాతావ‌ర‌ణం ఉంద‌ని, ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, ఎంతో మంది తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని, అందువ‌ల్ల ఈ సారి బ‌ర్త్ డే వేడుక‌ల‌ను జ‌రుపుకోవ‌డం లేద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలోనే త‌న ఫ్యాన్స్‌ను కోవిడ్ బాధితుల‌కు స‌హాయం చేయాల‌ని పిలుపునిచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

ఇక ఐపీఎల్ వాయిదా ప‌డ‌డంతో విరాట్ కోహ్లి ప్ర‌స్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐసీసీ టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌లో కోహ్లి ఆడ‌నున్నాడు. అనుష్క శ‌ర్మ చివ‌రి సారిగా షారుక్‌ఖాన్‌తో క‌లిసి జీరో అనే మూవీలో క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది గ‌ర్భం దాల్చిన ఆమె జ‌న‌వ‌రి నెల‌లో కుమార్తెకు జ‌న్మ‌నిచ్చింది. ఇక ఆమె నిర్మాత‌గా అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ పాతాల్ లోక్‌ను, నెట్‌ఫ్లిక్స్ మూవీ బుల్‌బుల్‌ను తీసింది. వాటికి వ్యూయ‌ర్ల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news