బీహార్ లో దారుణం.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన యువతి !

-

బీహార్ లోని పట్నాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బీహార్ లోని పట్నాలో ఓ యువతీ తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. తనను రహస్య వివాహం చేసుకొని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు అని తెలిసి ఈ దుశ్చర్యకు పాల్పడింది. బాధితులు చత్తీస్గఢ్ లో సిఆర్పిఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన బంధువుల అమ్మాయితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు.

ఇటీవల వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో తన ప్రేమికుడికి ఈ నెల 23న మళ్ళీ పెళ్లి జరగబోతోంది అన్న విషయం ప్రియురాలికి తెలిసింది. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ప్రియుడిని పట్నాలోని ఓ హోటల్ కు రప్పించింది. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో ప్రియుడి మర్మాంగాన్ని కోసింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news