భార్యకు కరోనా.. ఆత్మహత్య చేసుకున్న భర్త

-

కరోనా పేరు చెబితెనే జనాలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన భార్యకు కరోనా సోకిందని తెలియడంతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. “గురువారం ఉదయం 8 గంటలకు ఈ ఘటన గురించి మాకు సమాచారం అందింది. ఆత్మహత్య చేసుకున్న ఆ వ్యక్తిని 54 ఏళ్ల సత్బీర్ సింగ్‌గా గుర్తించాం. చనిపోయిన కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం.

ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని భార్యకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సత్బీర్‌కు కూడా కరోనా సోకిందా లేదా అయిందా నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు అతని కుమారుడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఘటన జరిగిన సమయంలో అతడు ఇంట్లో లేనట్టుగా తేలింది”అని చెప్పారు.

మరోవైపు కరోనా కేసుల సంఖ్య భారత్‌లో రోజరోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 35,365 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే 9,064 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1152 మంది మృతిచెందారు. ప్రస్తుతం భారత్‌లో 25,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news