ఆగస్టు 10 వరకు నుపుర్ శర్మ పై ఎలాంటి చర్యలు చేపట్టరాదు – సుప్రీంకోర్టు

-

ముస్లిం మత ప్రవక్తపై మాజీ బీజేపీ నాయకురాలు నుపుర్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాకుండా ముస్లిం దేశాల్లో సైతం నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల వివాదంలో చిక్కుకున్న బీజేపీ బ‌హిష్కృత నేత నుపుర్ శ‌ర్మ సోమ‌వారం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌కుండా నిలువ‌రించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు నుపుర్ శ‌ర్మ.

అంతేకాకుండా దేశ‌వ్యాప్తంగా త‌న‌పై న‌మోదైన అన్ని కేసుల‌ను ఒకే కేసుగా మార్చాల‌ని కూడా త‌న పిటిష‌న్‌లో సుప్రీంకోర్టును అభ్య‌ర్థించారు నుపుర్ శ‌ర్మ.ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నుపుర్ శర్మ కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. నుపుర్ శర్మపై ఆగస్టు 10 వరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదని అంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా నుపుర్ శర్మకు ప్రాణహాని ఉందంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news