కోహ్లీ దెబ్బకు ఆసుపత్రి పాలైన పాక్ క్రికెటర్ !

-

పాకిస్తాన్ జట్టు మాజీ ప్లేయర్‌ అక్మల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వికెట్ల వెనుక ఉంటూ… తనదైన కీపింగ్ అలాగే బ్యాటింగ్ తో పాకిస్తాన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు అక్మల్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకున్న అక్మల్…. జట్టు కోసం ఓపెనర్ గా కూడా మారాడు. దాదాపు 15 సంవత్సరాల పాటు పాకిస్తాన్ జట్టులో ప్లేయర్ గా సేవలందించాడు. 2017 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అక్మల్… ఆ తర్వాత ఎలాంటి దేశవాళి క్రికెట్ కూడా ఆడలేదు.

 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అక్మల్ పరిస్థితి… చాలా క్రిటికల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోలు షేర్ చేసిన అక్మల్… నేను కొలుకోవాలని ప్రార్థించండి ప్లీజ్ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తనకు ఎలాంటి అనారోగ్యం సంబంధించిందో మాత్రం అతడు చెప్పలేకపోయాడు. దీంతో నేటిజన్లు సమాధాన స్టైల్ లో స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ దెబ్బకే ఆసుపత్రి పాలయ్యాడు అంటూ ఇండియన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్వీట్లు పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news