PM MODI: నేడు ముగియనున్న మోదీ 45 గంటల ధ్యానం

-

కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ లో ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆయన 45 గంటల దీక్ష ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని బిజెపి వర్గాలు తెలిపాయి. దీక్ష ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు.

PM MODI 45-hour meditation will end today

ఇక అంతకు ముందు FY24 చివరి త్రైమాసికంలో GDP వృద్ధి 7.8% నమోదవడం దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి నిదర్శనమని PM మోడీ ట్వీట్ చేశారు. ఇది మరింత వేగవంతం కానందన్నారు. “ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ కొనసాగుతోంది. FY24లో 8.2 వృద్ధిరేటు నమోదవడమే దీనికి ఉదాహరణ. కష్టపడి పని చేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు. నేను ఇప్పటికే చెప్పినట్టు రాబోయే మంచి రోజులకు ఇది ట్రైలర్ మాత్రమే” అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news