పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ పార్థివదేహానికి ప్రధాని మోదీ నివాళులు

-

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూసిన విషయం తెలిసిందే. 95 ఏళ్ల ప్రకాష్ సింగ్ బాధల్ మంగళవారం మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వారం క్రితం మొహాలీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చేరారు ప్రకాష్. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం ఉదయం 8:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.

ఈ నేపథ్యంలో నేడు ప్రకాష్ సింగ్ బాదళ్ కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. ఇవాళ చండీగఢ్ చేరుకున్న ప్రధాని శిరోమణి అకాలీదల్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బాదల్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news