కేసీఆర్ పతనం మొదలైంది – గద్దర్

-

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అఖిలపక్షం నేతలతో నేడు ఇందిరాపార్క్ వద్ద “టి – సేవ్” పేరిట నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షకి ప్రజా యుద్ధనౌక గద్దర్ హాజరై తన మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే నినాదంతో షర్మిల తన పోరాటం మొదలు పెట్టారని తెలిపారు.

మొన్నటి వరకు మంత్రులు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియలేదని.. 30 నుంచి అందరూ మన ముందే ఉంటారని అన్నారు. సీఎం కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు గద్దర్. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు. ప్రజలు చిందించిన రక్తంతో గద్దెనెక్కిన కేసీఆర్ ను గద్దె దించేలా యువత దీక్ష తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ కి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు గద్దర్. తాను ఏ పార్టీ సభ్యుడిని కాదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news