BJP.. దేశంలోని ఏకైక పాన్ ఇండియా పార్టీ : నరేంద్ర మోదీ

-

భారతీయ జనతా పార్టీ.. కుటుంబాలు నడిపే పార్టీ కాదని.. దేశంలో ఉన్న ఏకైక పాన్ ఇండియా పార్టీ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా దిల్లీలో  మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. “మనం బలమైన రాజ్యాంగ వ్యవస్థలను కలిగి ఉన్నాం. అందుకే భారత్​ను అడ్డుకునేందుకే రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. ఏజెన్సీలు చర్యలు తీసుకుంటే వాటిపైనా దాడి జరుగుతోంది. న్యాయస్థానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొన్ని పార్టీలు అవినీతిని రక్షించాలని నినదిస్తున్నాయి.” అని ప్రతిపక్షాలపై వ్యంగాస్త్రాలు సంధించారు మోదీ.

మంగళవారం రోజున దిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయానికి పొడిగింపుగా నిర్మించిన నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసగించిన మోదీ.. బీజేపీ చిన్న పార్టీ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. పార్టీకే అంకితమైన కార్యకర్తలు, వారి త్యాగాల వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా కాకుండా అత్యంత భవిష్యత్తు ఉన్న పార్టీగా కూడా అవతరించిదని తెలిపారు. భారత్​ను ఆధునిక దేశంగా, అభివృద్ది దేశంగాను తయారు చేయడమే బీజేపీ లక్షమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news