PUBG: పబ్జీ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపిన కొడుకు

-

ఆన్ లైన్ గేమ్ పబ్ జీ యావత్ ప్రపంచాన్ని ఊపేస్తున్న విషయం తెలిసిందే. చిన్నపిల్లల నుంచి యువత వరకు అందరూ పబ్ జీ మోజులో పడి పోయారు. పబ్ జి ఆడుతూ సమయాన్నే మరిచిపోతున్నారు. అయితే ఈ గేమ్ కారణంగా చాలా మంది పిల్లలు, యువత తమ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. తాజాగా ఓ ఇంట్లో కూడా పబ్ జీ పెను విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఆదివారం బాలుడు ఇంట్లో మొబైల్ గేమ్ ఆడుతుండగా తల్లి సాధన అడ్డుకుంది.

దీంతో కోపం తెచ్చుకున్న కొడుకు ఇంట్లో ఉన్న తండ్రి కి చెందిన లైసెన్స్ డ్ తుపాకీ తీసుకొని తల్లి ని కాల్చి చంపాడు. అక్కడే ఉన్న పదేళ్ళ చెల్లిని వేరే గదిలో ఉంచి బయటకు రాకుండా బంధించాడు. తర్వాత మూడు రోజుల పాటు ఇంట్లో తల్లి మృతదేహం పక్కనే ఉన్నాడు. మృతదేహం కుళ్ళిపోయిన వాసన వస్తుండడంతో రకరకాల సెంట్లు స్ప్రై చేశాడు. చివరకు దుర్వాసన ఎక్కువకావడంతో తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.

తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. కాగా తల్లి మృతికి సంబంధించి కట్టు కథలు చెప్పేందుకు కూడా ప్రయత్నించాడు. ఎలక్ట్రిషియన్ వచ్చి తన తల్లిని చంపి వెళ్ళాడు అని చెప్పాడు. అయినప్పటికీ అనుమానం వచ్చిన పోలీసులు బాలుడిని విచారించగా అసలు విషయం తెలిసింది. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news