BREAKING : రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం పునరుద్ధరణ…

-

BREAKING : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం పునరుద్ధరణ అయింది. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో లోక్ సభలో ఎంపిగా రాహుల్ గాంధీ కొనసాగనున్నారు.

తాజాగా రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్దరణ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాహుల్ పై అనర్హత వేటు ను తొలగిస్తూ బులిటెన్ విడుదల చేశారు పార్లమెంట్ సెక్రటరీ జనరల్. లక్షదీప్ కు చెందిన “నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ” (ఎన్.సి.పి)ఎమ్.పి మహమ్మద్ ఫైజల్ విషయంలో కూడా సభ్యత్వ పునరుద్దరణ నెలపైగానే జాప్యం అయింది. కానీ రాహుల్‌ విషయంలో స్పీకర్‌ ఓం బీర్లా పాజిటివ్‌ గా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాహుల్ పై అనర్హత వేటు ను తొలగిస్తూ బులిటెన్ విడుదల చేశారు పార్లమెంట్ సెక్రటరీ జనరల్.

Read more RELATED
Recommended to you

Latest news