బ్రేకింగ్:రామ్ జన్మభూమి ట్రస్ట్ అధిపతికి కరోనా పాజిటివ్…!

-

గత వారం జరిగిన రామ జన్మభూమి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రామ్ జన్మభూమి ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ కరోనా బారిన పడ్డారు. ఆయన శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి కూర్చున్నారు. ఈ నెల 5 న ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటుగా వేదికపై మరో 5 మంది పాల్గొనగా వారిలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ మరియు బిజెపి సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఇక శంకుస్థాపన వేడుకలో పాల్గొన్న ఒక పూజారి ప్రదీప్ దాస్ కి కరోనా వచ్చింది. భద్రతలో ఉన్న 14 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news