IPL 2023 : సెంచరీతో RCBని గెలిపించిన కోహ్లీ

-

నిన్న జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ లో హైదరాబాద్‌ జట్టుపై బెంగళూరు జట్టు గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ జట్టుపై బెంగళూరు జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. కానీ ఆ ల క్ష్యాన్ని బెంగళూరు ఆడుతూ పాడుతూ చేధించింది.

సన్రైజర్స్ విధించిన 187 పరుగుల టార్గెట్ ను చెదించేందుకు బరిలో దిగిన బెంగళూరుకు కోహ్లీ, డూప్లెసిస్ కలిసి మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి ఫస్ట్ వికెట్ కు 172 పరుగులు జోడించారు. కోహ్లీ, డూప్లెసిస్ ఎడా పెడా బౌండరీలు, సిక్సర్లు బాధలతో బెంగుళూరు 11 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీలు చేసిన తర్వాత కోహ్లీ, డూప్లేసిస్ దూకుడు పెంచారు. ఈ క్రమం లో భువనేశ్వర్ బౌలింగ్ లో సిక్స్ కొట్టి 62 బాల్స్ లోనే సెంచరీ పూర్తి చేసు కున్నాడు కోహ్లీ. చివరగా కోహ్లీ 2019 ఐపీఎల్ సీజన్ లో సెంచరీ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news