BREAKING : రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితున్ని విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు

-

BREAKING : రాజీవ్‌ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజీవ్‌ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందుతుడైన పెరరివాలన్ ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

పెరరివాలన్ క్షమాభిక్ష అభ్యర్థనపై నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 31 ఏళ్లుగా కటకటాల వెనుక ఉన్నారు ఏజీ పెరరివాలన్‌. అయితతే… తాజాగా ఇవాళ భారత అత్యున్నత న్యాయస్థానం పెరరివాలన్ ను క్షమాభిక్ష అభ్యర్థనపై విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం అధికారాన్ని ఉపయోగించుకుని.. రాజీవ్ గాంధీ హత్య కేసులో పేరారివాలన్ మరియు ఇతర దోషులకు క్షమాపణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. అయితే, గవర్నర్ ఈ విషయాన్ని భారత రాష్ట్రపతికి సూచించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news