BREAKING : శివసేన నేత సంజయ్​ రౌత్ ఆస్తులు సీజ్​

-

శివసేన పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు సంజయ్ రౌత్ కు ఊహించని షాక్ తగిలింది. ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఆస్తులను… ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్… ఉన్నఫలంగా దాడులు చేసి సీజ్ చేసింది. వెయ్యి కోట్ల విలువైన పాత్ర చాల్ భూ కుంభకోణం లో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు చెందిన ఆలీబాగ్ లోని ఎనిమిది భూములు, ముంబై దాదర్లోని ఓ ఫ్లాట్ ను జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.

మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ మేరకు చర్యలు చేపట్టింది ఈ డి. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ రావు ఫిబ్రవరిలోనే అరెస్టు చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. అనంతరం చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. మరో మనీలాండరింగ్ కేసు పి ఎం సి బ్యాంక్ మోసానికి సంబంధించి సంజయ్ రౌత్ సతీమణి వర్షం ను గత సంవత్సరం ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రవీణ్ రౌత్ భార్య మాధురితో వర్షాలకు సంబంధాల పై ప్రశ్నలు సంధించింది ఈడి. ఇక ఇవాళ..సంజయ్ రౌత్ కు సంబంధించిన ఆస్తులను… ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్…దాడులు చేసి సీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news