BREAKING: సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్

-

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి మరోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి ఆమె తీవ్ర జలుబుతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీకి  ఇవాళ కరోనా పరీక్షలు చేశారు. అయితే ఈ పరీక్షల్లో సోనియాగాంధీకి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోం ఐసోలేషన్ లోకి వెళ్లింది.

ఈ విషయాన్ని జయరాం రమేష్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మధ్యలో కాలంలో.. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ఆ సూచనలు చేశారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యం మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. కాగా అటు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. కరోనా లక్షణాల కారణంగా ప్రస్తుతం ఆయన కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news