భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంక్…!

-

దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) సెప్టెంబర్ 10 నుండి ఫిక్సిడ్ డిపాజిట్ల విషయంలో ఎంపిక చేసిన ఖాతాదారుల విషయంలో వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్బిఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మే 27 న ఒకసారి, మే 12 న ఒకసారి తగ్గించింది. సెప్టెంబర్ 10 నుండి కొత్త వడ్డీ రేట్లు తాజాగా డిపాజిట్ లకు కూడా వర్తిస్తాయి అని పేర్కొంది బ్యాంకు.

రిటైల్ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేసామని చెప్పింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న వారి.. వడ్డీ రేట్లు 10.09.2020 నుండి సవరించబడ్డాయని చెప్పింది. ఎస్బిఐ స్టాఫ్ మరియు ఎస్బిఐ పెన్షనర్లకు చెల్లించవలసిన వడ్డీ రేటు వర్తించే రేటు కంటే 1.00% ఉంటుంది అని స్టేట్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news