IND VS WI : టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు

-

 

WTC టెస్ట్ ఫైనల్ లో టీమిండియా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వెస్టీండీస్ గడ్డపైన టెస్ట్ లు, వన్ డే లు మరియు టీ 20 లు ఆడడాని కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే టెస్ట్ మరియు వన్ డే జట్లను ప్రకటించిన బీసీసీఐ, తాజాగా టీ 20 జట్టును కూడా ప్రకటిం చింది. బీసీసీఐ సెలక్షన్ ప్రకారం ఈ టీ 20 లకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా నియమించింది.

అటు హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ టీమిండియాకు ఎంపిక అయ్యారు. వెస్టిండీస్ తో జరగనున్న టి 20 సిరీస్లో ఆడనున్నారు. IPLలో ముంబై తరఫున ఆడుతున్న తిలక్ వర్మ తన ఆటతీరుతో అందరిని మెప్పించారు. ఐపీఎల్-2022లో 397 రన్స్, ఐపిఎల్-2023లో 343 రన్స్ చేసి రానించారు. తిలక్ కి టీమిండియా తరఫున మూడుసార్లు ఆడే సత్తా ఉందని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news