జమ్ము కశ్మీర్ లో విషాదం.. బస్సు లోయలో పడి 7గురు మృతి

-

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడి పడిపోవడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన జమ్ముకశ్మీర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ జిల్లాలోని అబూర్లోని చుంగి మార్ట్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం లోయలో బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా బస్సు దాదాపు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న ఏడుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. 28 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే రక్షణ చర్యలు చేపట్టి గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news