BIG BREAKING : ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..!

-

ప్రధాని నరేంద్ర మోడీకి హ్యాకర్లు షాక్ ఇచ్చారు. మోడీ పర్సనల్ వెబ్‌సైట్‌ కు చెందిన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ప్రధాని ట్విట్టర్ అకౌంట్‌కు క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ ఓ ట్వీట్ వచ్చింది. ఆ కరెన్సీ కోవిడ్-19 పీఎం మోదీ రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేయాలని ఉంది. మోదీ ట్విట్టర్ అకౌంట్‌ జాన్ విక్ పేరుతో హ్యాక్ అయ్యింది. అయితే ఈ జాన్ విక్ గ్రూప్ కు పేటీఎం మాల్ డేటా చోరీలో హస్తముందనే ఆరోపణలున్నాయి. ఇకపోతే ఆ అకౌంట్ కు దాదాపు 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

అయితే తాజాగా ఆ అకౌంట్ నుంచి మరో ట్వీట్ వచ్చింది. అవును ఈ అకౌంట్ ను హ్యాక్ చేసింది జాన్ విక్. కానీ, పేటీఎం మాల్ డేటా చోరీతో మాకు హస్తం లేదు అని అందులో పేర్కొన్నారు. ఇకపోతే గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్‌సైట్‌లో ఆయన వ్యక్తిగత సమాచారం, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని కిషన్ రెడ్డి కార్యాలయం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news