జియో తో కలిసి పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది: సుందర్ పిచాయ్

-

నేడు జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షికోత్సవ సభలో ముకేష్ అంబాని తెలిపిన విధంగా గూగుల్ సంస్థ రిలయన్స్ సంబంధించిన జియో ఫ్లాట్ ఫామ్ లో ఏకంగా రూ 33,737 కోట్ల పెట్టుబడితో, జియో లోని 7.7 శాతం వాటాను సొంతం చేసుకోబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. ఇక ఈ విషయం పై గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా గూగుల్ ఫర్ ఇండియా లో భాగంగా మొదటగా రిలయన్స్ జియో తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు.

sundhar
sundhar

అంతేకాకుండా భారతదేశంలో స్మార్ట్ ఫోన్ లేని లక్షల మందికి అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడం కోసం గూగుల్ సంస్థ జియో కంపెనీ తో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని సుందర్ పిచాయ్ వెల్లడించారు. నిన్నటి రోజున ప్రధాని మోడీ తో జరిగిన సమావేశం తర్వాత గూగుల్ సంస్థ ఏకంగా రూ. 75 వేల కోట్ల పెట్టుబడులను భారతదేశంలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే రిలయన్స్ జియో లో మొదటగా ఒప్పందం కుదుర్చుకున్నామని, మిగతా పెట్టుబడులు మౌలిక వసతులు, భాగస్వామ్యాలు, ఈక్విటీ పెట్టుబడులు వంటి వివిధ మార్గాలలో సమకూరుస్తామని సుందర్ పిచాయ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news