ఉగ్రవాదులతో పోరాడిన “జూమ్” వీరమరణం

-

జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా తంగ్ పావ ప్రాంతంలో ఈనెల 10వ తేదీన భారత ఆర్మీ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు తలదాచుకున్న ఓ ఇంట్లోకి భారత బలగాలు “జూమ్” అనే ఈ జాగిలాన్ని పంపారు. ఉగ్రవాదులపై ఈ జాగిలం దాడి చేసి, చేజ్ చేసే సమయంలో కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయారు.

ఈ ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించగా.. పలువురు భారత జవాన్లు గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులలో తీవ్రంగా గాయపడిన జాగిలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వీరమరణం పొందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జూమ్ కు నివాళులర్పిస్తూ.. జైహింద్ అంటూ నటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news