బీహార్ లో నక్సల్స్ దారుణం… నలుగురిని చంపిన నక్సలైట్లు.

-

బీహార్ లో నక్సలైట్లు దారుణానికి ఒడిగట్టారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరేసి చంపారు. ఈ ఘటన గయాలోని డుమారియాలోని మనువార్ గ్రామంలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులకు సహకరిస్తున్నారనే అనుమానంతో నక్సలైట్లు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం బాధితుల ఇంటిని డైనమైట్ తో పేల్చేశారు. డుమారియా ప్రాంత నిషేధిత నక్సలైట్లకు, సీపీఐ మావోయిస్టు పార్టీకి పట్లున్న ప్రాంతం. గత వారం పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌కు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం.

మార్చి 16, 2021 న, పోలీసులు మరియు నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లను పోలీసులు చంపారు. ఈ ఘటనకు ప్రస్తుతం చంపివేయబడ్డ నలుగురికి సంబంధం ఉందని అనుమానిస్తున్నారు నక్సల్స్. ఈ ఘటనను కుట్రగా అభివర్ణించిన నక్సల్స్ తమ సహచరుల మరణానికి ప్రతీకారం తీర్చకుంటామని గతంలో ప్రకటించారు. ఇదే ఘటనకు ప్రతీకారంగా శనివారం అర్థరాత్రి సర్జూ సింగ్ భోక్తా ఇంటిని డైనమైట్‌తో పేల్చివేశారు. అదే సమయంలో, సర్జూ సింగ్ భోక్తా, సతేంద్ర సింగ్ భోక్తా మరియు మహేంద్ర సింగ్ భోక్తా ఇద్దరు కుమారులు, భార్యతో పాటు మరో మహిళ ఉరివేసుకుని చంపారు. సంఘటన తర్వాత సీఆర్పీఎఫ్, కోబ్రా, గయా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిత్య కుమార్, సిటీ ఎస్పీ రాకేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం ప్రాంతాన్ని సీల్ చేసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అవాంతరాలు సృష్టించేందుకు నక్సలైట్లు ఈ చర్య తీసుకున్నారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిత్య కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news