హైదరాబాద్ లో చోరీ.. నేపాల్ బార్డర్ లో చిక్కిన నేపాల్ గ్యాంగ్ !

-

రాయదుర్గంలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి పారిపోయిన నేపాలీ గ్యాంగ్ అరెస్ట్ అయింది. రాష్ట్రాలు దాటి నేపాల్ పారిపోతున్న క్రమంలో యూపీ బార్డర్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నెల ఆరో తారీఖున రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిఎంఆర్ హిల్స్ లో బోర్ వెల్ కాంట్రాక్టర్ గూడూరు మధుసూదన్ రెడ్డి ఇంట్లో యజమానులకు మత్తుమందు ఇచ్చి భారీగా నగదు బంగారం అపహరించిన నేపాలి గ్యాంగ్ అక్కడి నుండి ఎస్కేప్ అయింది.

Crime

అయితే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారని పోలీసులు అనుకుని వెతికే పనిలో ఉన్నారు. కానీ ఎందుకయినా మంచిదని ఇతర రాష్ట్రాల పోలీసులకి కూడా సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో వారు నేపాల్ బోర్డర్ లో దొరికేశారు. వినోద్ సాహి, నార్జింగ్ సాహీ , సీత లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 5 లక్షల నగదు తో పాటు బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈరోజు వారిని హైదరాబాద్ తీసుకురానున్న పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news